భువీ కుటుంబ సభ్యులకు కరోనా

భువీ కుటుంబ సభ్యులకు కరోనా

టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. అతని తల్లి ఇంద్రేష్ దేవి పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆమెను మీరట్ లోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

గర్భవతి అయినా భువీ భార్య నూపుర్కు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో క్వారంటైన్లో ఉన్నారు. గత నెల 20న భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్.. క్యాన్సర్ తో మృతి చెందారు. ఆ తర్వాత ఆయన కర్మకాండలను బులంద్ షహర్లో నిర్వహించారు.

తర్వాతి రోజు భువీతో పాటు కుటుంబ సభ్యులందరూ కొవిడ్ టెస్ట్ చేయించుకోగా.. వారందరికీ నెగెటివ్గా తేలింది. నాలుగు రోజుల తర్వాత భువీ తల్లి ఇంద్రేష్కు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో మరో సారి పరీక్షలు చేయించగా.. కరోనా నిర్ధరణ అయింది. దీంతో వీరంతా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఆయన తల్లికి ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆక్సిజన్ స్థాయి పడిపోతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.